*సాయిబాబా షిరిడీలో సజీవముగ ఉన్నప్పుడు మహారాష్ట్ర, గుజరాత్, గోవా మున్నగు ప్రదేశాలలో అనేక మంది భక్తులుండేవారు.*
*అందులో బొంబాయి నగరంలో రామకృష్ణ కొఠారీ అని పేరుగల వ్యక్తి మాతృమూర్తి ఒకరు.* *ఒకసారి రామకృష్ణ కొఠారి తండ్రికి న్యుమోనియా జ్వరం వచ్చి పరిస్ధితి విషమించింది.*
*డాక్టర్లు కొన్ని గంటలు మాత్రమే బ్రతుకుతాడని చెప్పారు.*
*కొఠారి తల్లికి షిర్డి సాయినాధుడు తప్ప వేరే దైవం లేడు. బాబాను ఆర్తితో ప్రార్ధించింది. షిరిడీకి పాదయాత్ర చేస్తానని మొక్కుకుంది.*
*సాయిబాబా కరుణించినందున కొఠారీ తండ్రి ప్రాణాలు దక్కాయి.*
*మొక్కుకున్నందున కొఠారి తండ్రి, తల్లి,మరి కొందరితో బొంబాయి నుండి పాదయాత్ర చేస్తూ, షిరిడీకి దగ్గరలోగల కోపరగాన్ పట్టణానికి చేరుకున్నారు.*
*అక్కడనుంచి మొక్కుకున్న కొఠారి తల్లి తప్ప మిగతావారందరూ ఎద్దులబండ్లలో షిరిడీకి వెళ్లిపోయారు.*
*కోపెరగాన్ నుండి ఆమె షిరిడీకి నడక మొదలెట్టింది.* *అక్కడనుంచి అమెకు కాళ్ళు వాచిపోయి నెప్పుపెట్టినందున, దారిలో గల ఒక చెట్టుక్రింద విశ్రమించినపుడు,బాగా గెడ్డం పెంచుకొని ఉన్న, పశువుల కాపరిగా కనిపిస్తున్న ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి " అమ్మా !సాయిబాబా నీ మొక్కును స్వీకరించారు. ఇక నీవు బండిలో షిరిడీకి వెళ్ళు " అని చెప్పాడు.*
*అయినా ఆమె అందుకు అంగీకరించకుండా,నడక సాగించింది.*
*షిరిడీలో అది మధ్యాన్న సమయము ఆరతి సమయము.*
*బాబా ద్వారకామాయిలో ఆసీనుడైయున్నాడు. బాబాకు నిత్యమూ ఆరతి యిచ్చే బాపూసాబ్ జోగ్ బాబాకు హారతి ఇవ్వడానికి సిద్ధపడుతుండగా బాబా, జోగ్ ను కొంచంసేపు ఆగమన్నారు.*
*కొంతసేపటికి రామకృష్ణ కొఠారి తల్లి కాలినడకను ద్వారకామాయిని చేరుకొంది.*
*సాయిబాబాను మనసారా దర్శించుకొన్నది. బాబా ఆక్కడివారితో " ఈ తల్లిని దారిలో కలిసాను. నడక చాలునని చెప్పినా వినిపించుకోకుండా పాదయాత్ర చేసింది "అన్నారు.*
.jpg)
No comments:
Post a Comment