Saturday, June 8, 2024

లక్ష్మణ్ మామా జోషి అలియాస్ లక్ష్మణ్ రత్నపార్కి కుమారుడు బపాజీ రత్నపార్కి మరణించిన రోజు..

 ఓం శ్రీ సాయిరాం 🙏 🙏 



     లక్ష్మణ్ మామా జోషి అలియాస్ లక్ష్మణ్ రత్నపార్కి కుమారుడు బపాజీ రత్నపార్కి మరణించిన రోజు..


      లక్ష్మణ్ మామా జోషి అలియాస్ లక్ష్మణ్ రత్నపార్కి కుమారుడు బపాజీ రత్నపార్కి (అధ్యాయం-43-44) మే12, 1987న కన్నుమూశారు..


     లక్ష్మణ్ రత్నపార్కి పూర్వీకులు విలువైన రాళ్లు వజ్రాలను అంచనా వేయడంలో నిపుణులు. కాబట్టే వారిని రత్నపార్కి అనే ఇంటిపేరుతో పిలిచేవారు...


     వృత్తి రీత్యా బ్రాహ్మణులు, పూజారులు. వారు షిరిడీకి వలస వెళ్లి అక్కడే తమ నివాసంగా చేసుకున్నారు. లక్ష్మణ్ మామా గ్రామ పూజారి మరియు జ్యోతిష్కుడు..శ్యామాకు మేనమామ వరుస..వీరి ఇల్లు విఠల్ మందిరం వెనుక ఉంది.


        ఒకసారి బాపాజీకి అనారోగ్యం రావడంతో రకరకాల చికిత్సలు అందించారు, కానీ ఏమీ పని చేయలేదు. చివరికి అతని తండ్రి (లక్ష్మణ్ మామా)వైద్యం కోసం బాబా వద్దకు పరుగెత్తాడు. బాబా అతనిపై గట్టిగా అరిచి... కొద్దిసేపటి తరువాత బాబానే స్వయంగా వారి ఇంటికి వెళ్ళి ఆశీర్వదిస్తూ తన చేతిని బాపాజీ నుదిటిపై ఉంచారు.  అతని అనారోగ్యం తగ్గటంతో.. ఈ సంఘటన బాబా పట్ల ఆయనకున్న విశ్వాసాన్ని, భక్తిని మరింత బలపరిచింది..


         1918 అక్టోబరు 15న బాబా మహాసమాధి చెందినప్పుడు బాపాజీ ఆయనతో పాటు ద్వారకామాయిలో ఉన్నారు. బాబా ఆందోళనతో ఉన్న భక్తులను ఇంటికి పంపించారు. ఇంకా కొంతమంది భక్తులు వెనుక ఉండిపోయారు వారిలో బాపాజీ ఒకరు. 


       మరుసటిరోజు తెల్లవారుజామున లక్ష్మణ్ మామాకు బాబా కలలో తనకు కాకడా ఆరతి ఇవ్వమని చెప్పారు. బాబా ఆజ్ఞానుసారం కాకడా ఆరతికి మౌల్వీలు అడ్డు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా...ఎంతో  భక్తితో బాబా పాదాలు కడిగి, కన్నీరు కారుస్తూ ఆరతి ఇచ్చాడు. తర్వాత బాబా మూసి ఉన్న పిడికిలిని తెరిచి తన దక్షిణ, తాంబూలం ఉంచి వెళ్లిపోయాడు. (శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం- 43-44)..


       "జోషి" అనే ఇంటిపేరుతో పిలవబడే వారి కుటుంబ వారసులు.. ముని మనవలైన జగదీష్ రత్నపార్కి, వినాయక్ రత్నపార్కి ఇప్పటికీ షిర్డీలోని పాత విఠల్ మందిరం దగ్గరలోని అదే ఇంటిలో నివసిస్తున్నారు.. 


ఓం శ్రీ సాయిరాం 🙏 🙏 🌹

No comments:

Post a Comment