Saturday, June 8, 2024

బాబా స్నానం చేసిన రాయి

 ఓం శ్రీ సాయిరాం



      బాబా స్నానం చేసిన రాయి


ఈ రాయిని నాసిక్‌కు చెందిన రాంబాజీ  ఇచ్చారు... 


    బాబా లీలలు విని మానసిక వికలాంగుడైన రాంబాజీ  షిరిడీకి వచ్చాడు... 


     అతను బాబా స్నానం చేసిన నీటిని వైద్యంగా తన శరీరానికి వాడేవాడు. 


     అలా చేయడం వల్ల అతని మానసిక రుగ్మత నుంచి బయటపడ్డాడు..

 

     దానికి గుర్తుగా అతను కృతజ్ఞతతో ఈ రాయిని సిద్ధం చేసి, దానిపై కూర్చుని స్నానం చేయడానికి బాబాకు సమర్పించాడు.


     ఈ స్నానపు రాయిని కొద్ది రోజులు ద్వారకామాయి వరండాలో ఉంచారు...

 

      మ్యూజియం ప్రారంభించిన తర్వాత స్నానపు రాయిని మ్యూజియం గ్రౌండ్ ఫ్లోర్‌లోని హాలులో ఉంచారు...


  ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:

Post a Comment