ఓం శ్రీ సాయిరాం 🙏🙏
మోరేశ్వర్ వామన్ ప్రధాన్ 1918లో లెండి బాగ్ని కొనుగోలు చేసి...తర్వాత దానిని శ్రీ సాయిబాబా సంస్థాన్కు బహుమతిగా ఇచ్చారు...
లెండి బాగ్ షిర్డీలో ఈశాన్య దిక్కులో ఉంటుంది. సాయిబాబా ప్రతిరోజు ఉదయాన్నే లెండి బాగ్కు వెళ్లేవారు...
షిరిడి ఊరి పొలిమేరలో ఉన్న చిన్న వాగు పేరు లెండి.
అందుకే వాగు సమీపంలోని భూమిని బాబా 'లెండి బాగ్' అని పిలిచేవారు...
బాబా ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం లెండి బాగ్కి వెళ్ళేవారు.. బాబా వెంట బూటీ, భాగోజిషిండే, నిమోన్కర్ ఉండేవారు.. కొంతమంది భక్తులు లెండి బాగ్ లో బాబాను దర్శించుకునేవారు..
1910 మే నెలలో నానాసాహెబ్ చాందోర్కర్ ఇద్దరు కుమారులు బాపు, బాబులతో కలసి ప్రధాన్ మొట్టమొదటిసారిగా బాబాని దర్శించుకున్నారు.. బాబా అతనిని ఎనిమిది రోజులు షిరిడీలో ఉంచారు. షిరిడీలో ఉన్న సమయంలో ప్రధాన్ కి బాబా మీద అమితమైన భక్తి, విశ్వాసం కలిగాయి..
ఒక గురువారం మధ్యాహ్నం బాబా...ప్రధాన్, బాపు, బాబులను తీసుకొని లెండీకి వెళ్ళారు. సాధారణంగా వారు లెండీకి వెళ్లే సమయం కాదది. అక్కడ బాబా కొన్ని గుంటలు త్రవ్వి ప్రధాన్ చేతికి కొన్ని మొక్కజొన్న విత్తనాలిచ్చి ఆ గుంటలలో పెట్టించి, వాటిపై మట్టి కప్పి నీళ్ళు పోయమన్నారు. ప్రధాన్ బాబా చెప్పినట్టే చేశాడు..తరువాత వాళ్ళు మసీదుకు తిరిగి వచ్చారు.
ఈ సంఘటన జరిగిన ఏడెనిమిది సంవత్సరాల తరువాత ఆ లెండి బాగ్ ని ప్రధాన్ రూ. 1500/-లకి కొనుగోలు చేసి, సంస్థాన్ ఏర్పడ్డాక దాన్ని సంస్థాన్కు బహుమతిగా సమర్పించాడు...
షిర్డీని సందర్శించే భక్తులు గేటు పైన "మోరేశ్వర్ ప్రధాన్ చే లెండి బాగ్" అని రాసి ఉన్న బోర్డును చూడవచ్చు...
లెండి బాగ్ బాబా పాదధూళితో పవిత్రమైన ప్రదేశం...
ఈ తోట నిండా పారిజాత, చంపా, చమేలీ, జుయ్ మరియు జై వంటి పూల మొక్కలు ఉన్నాయి.
1980ల వరకు లెండి బాగ్ లో ఒక అందమైన ప్రవేశద్వారం దానిపైన పూవులతో బౌగెన్విల్లా పందిరి ఉండేది..లెండి బాగ్ ఎడమ వైపున, జింకలు, కుందేళ్ళు సంచరించే మరొక గులాబీ తోట ఉండేది..
దేవతా వృక్షాలైన మామిడి..వేప.. అశ్వత్థ.. ఔదుంబర్ వంటి చెట్లను బాబా స్వయంగా నాటి పోషించారు... నందా దీపం వెలిగించారు..
ఓం శ్రీ సాయిరాం🙏🙏🌹
.jpg)
No comments:
Post a Comment