Saturday, June 8, 2024

ప్రొ. గణేష్ గోవింద్ నార్కే...(జి.జి.నార్కే)...(బాపూసాహెబ్ బూటి అల్లుడు)..1918లో పూణేలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్యోగం పొందారు..

 ఓం శ్రీ సాయిరాం 🙏 🙏..



    ప్రొ. గణేష్ గోవింద్ నార్కే...(జి.జి.నార్కే)...(బాపూసాహెబ్ బూటి అల్లుడు)..1918లో పూణేలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్యోగం పొందారు.. 


   శ్రీ సాయి సచ్చరిత్ర -14, 27 & 42 అధ్యాయాలలో ఇతని ప్రస్తావన ఉంటుంది..శ్రీసాయిబాబాతో ప్రత్యక్ష అనుబంధం ఉండి, సాయి సంస్థాన్‌కు సేవలను అందించిన భక్తులలో గణేష్ గోవింద్ నార్కే ఒకరు...


      1905వ సంవత్సరంలో ఎమ్.ఎ. పట్టా పుచ్చుకున్నాడు...1907 నుండి 1909 వరకు కలకత్తాలో భూగర్భ పరిశోధనలో శిక్షణ పొందాడు...1909లో భారత ప్రభుత్వం అతన్ని ఉన్నత విద్యకై మాంచెస్టర్(ఇంగ్లాండ్) పంపింది. అతనక్కడ గనులు, భూగర్భశాస్త్రంలో ఎమ్.ఎస్.సి. పట్టా పుచ్చుకుని 1912 ఆగస్టులో స్వదేశానికి తిరిగి వచ్చాడు...


     అతని భార్య, తల్లి, మామగారు బూటీ తరచూ శిరిడీ దర్శిస్తూ, బాబా సన్నిధిలో గడుపుతుండేవారు. ఒకసారి వాళ్ళు, "శిరిడీ వచ్చి బాబాను దర్శించుకోమ"ని నార్కేకు ఉత్తరం వ్రాశారు...అందువలన నార్కే 1913, ఏప్రిల్ నెలలో మొదటిసారి శిరిడీ సందర్శించాడు...


      శ్యామా అతనిని బాబా దర్శనానికి తీసుకుని వెళ్లి బాబాకు పరిచయం చేయగా..."ఇతనిని నాకు పరిచయం చేస్తున్నావా! ముప్ఫై జన్మల నుండి ఇతను నాకు తెలుసు!" అన్నారు.


      మొదటిసారిగా నార్కే బాబాను దర్శించినప్పుడు వారి అనుభవం గురించి చెప్తూ...ఆరతి సమయంలో బాబా మిక్కిలి కోపంగా ఉన్నారు. అకారణంగా వారు కోపగించి శపించి భయపెట్టుచున్నారు... "ఆయన పిచ్చివాడా!" అనే సంశయం నా మనసులో మెదిలింది..ఆరతి పూర్తయ్యాక నేను బాబా పాదాలు ఒత్తుతూ ఉండగా.. బాబా ప్రేమగా నా తల నిమిరి నేను పిచ్చివాడను కాను అన్నారు.. (సాయి సచ్చరిత్ర ఉపోద్ఘాతం...)


    నార్కే మొదటిసారి బాబా దర్శనం చేసుకున్నప్పుడు కేవలం మూడు నాలుగు రోజులు మాత్రమే శిరిడీలో ఉన్నాడు. తరువాత బాలఘాట్, బర్మాలకు వెళ్ళి.. బర్మా ఆయిల్ కంపెనీలో మూడునెలలు ఉద్యోగం చేసి తిరిగి నాగపూర్ చేరుకున్నాడు...బాబా అతనిని శిరిడీ రమ్మన్నారని మాధవరావు నుండి ఉత్తరం రావడంతో ఈసారి అతనొక్కడే శిరిడీ వెళ్లి 13 నెలలు శిరిడీలో గడిపాడు...


     1913లో ఒకరోజు బాబా నార్కేతో, “మీ మామ ఇక్కడొక పెద్ద రాతి కట్టడం నిర్మిస్తాడు. దానికి నీవు పర్యవేక్షకునిగా ఉంటావు" అని అన్నారు. బూటీ 1915-1916లో ప్రస్తుత సమాధిమందిరం  నిర్మాణాన్ని ప్రారంభించాడు...బాబా చెప్పినట్లుగానే..1920 తరువాత ఏర్పాటు చేసిన సమాధిమందిర ట్రస్టులో నార్కే ఒక సభ్యునిగా సేవలు అందించాడు...


     నార్కేకు చాలాకాలం వరకు స్థిరమైన ఉద్యోగం దొరకలేదు...ఆ విషయమై అతని తల్లి చాలా ఆందోళన చెంది... ఉద్యోగ కోసం తన బిడ్డ కలకత్తా, బర్మా వంటి దూరప్రాంతాలకు వెళ్లడం చూసిన ఆమె ఒకసారి బాబాతో, "బాబా! నా బిడ్డని మా ఊరిలోగానీ, శిరిడీకి దగ్గరలోగానీ మంచి ఉద్యోగంలో స్థిరపడేలా అనుగ్రహించండి" అని మొరపెట్టుకుంది. అప్పుడు బాబా, "నేనతనిని పూనాలో స్థిరపరుస్తాను!" అని అన్నారు.


      తన విద్యార్హతలకు తగిన ఉద్యోగం పూనాలో దొరికే అవకాశం లేదని తనలో తాను నవ్వుకునేవాడు నార్కే...1917లో ఒకసారి వారణాసి విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్వ్యూకి రమ్మని అతనికి ఉత్తరం వచ్చింది. బాబాను సలహా అడిగితే, “నువ్వు వారణాసి వెళ్ళనవసరం లేదు, పూనా వెళ్ళు” అన్నారు..


     1917వ సంవత్సరంలో పూనా విశ్వవిద్యాలయంలో భూగర్భశాస్త్రానికి సంబంధించిన కోర్సు ప్రారంభమయి... ఆ శాస్త్రాన్ని బోధించేందుకు ఒక ప్రొఫెసర్ కావాలని పత్రికా ప్రకటన వెలువడింది...


        అది చూసిన నార్కే, "ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయమంటారా?" అని బాబాను అడగగా..బాబా అనుమతించడంతో వెంటనే ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు...ఎంతోమంది అభ్యర్థులు ఆ ఉద్యోగానికై పోటీపడ్డారు. 


     బాబా ఆశీర్వదించినట్లుగానే నార్కే 1918లో ఆ విశ్వవిద్యాలయంలో భూగర్భ, గనుల శాస్త్రంలో ప్రొఫెసర్‌గా మంచి జీతంతో నియమితుడయ్యాడు. 1919లో ఆ ఉద్యోగం పర్మినెంట్ అయింది...


    బాబా ప్రతిసారీ ‘పూనా’ వెళ్ళు అని ఎందుకు అనేవారో అప్పుడతనికి అర్థమై, ఈ ఉద్యోగ విషయం 1913లోనే బాబా దృష్టిలో ఉందని గ్రహించాడు. "నా భవిష్యత్తు మొత్తం బాబాకు తెలుసన్నమాట" అని అనుకున్నాడు...


      (మూలం:- భక్తుల అనుభవాలు: శ్రీ బి.వి నరసింహ స్వామిజి..)


   ఓం శ్రీ సాయిరాం 🙏 🙏 🌹..

No comments:

Post a Comment