Saturday, June 8, 2024

శ్రీ షిర్డీ సాయి మందిరం (దక్షిణ షిర్డీ)... ప్రధాన రహదారి..జైన దేవాలయం దగ్గర...పెనుకొండ..ఆంధ్రప్రదేశ్

 ఓం శ్రీ సాయిరాం 🙏🙏



    శ్రీ షిర్డీ సాయి మందిరం (దక్షిణ షిర్డీ)... ప్రధాన రహదారి..జైన దేవాలయం దగ్గర...పెనుకొండ..ఆంధ్రప్రదేశ్ 


      ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లా పెనుకొండ పట్టణంలో ఉంది. ఈ ఆలయం జైన దేవాలయం సమీపంలో...పెనుకొండ RTC బస్టాండ్ నుండి 1 కి:మీ దూరంలో ఉంది.


   శ్రీ  కేశవయ్య గారు ఈ ఆలయ వ్యవస్థాపకులు...ఆలయ భూమి పూజ 1946లో జరిగింది .


     ఒక సాయి భక్తుడు విరాళంగా ఇచ్చిన సొంత స్థలంలో ఈ ఆలయం నిర్మించబడింది.


     1947 అక్టోబర్ 24 న విజయదశమి రోజున శ్రీ స్వామి కేశవయ్యజీ ఈ ఆలయాన్ని ప్రారంభించారు..


        షిర్డీ నుండి తెచ్చిన పాలరాతి పాదుకలు శ్రీ  కేశవయ్య గారిచే ప్రతిష్టింపబడ్డాయి.. ద్వారకామాయి (సాయిబాబా) చిత్రపటం ఆలయ గర్భగుడిలో ఉంటుంది... 


    శ్రీ కేశవయ్య గారు1942-1950 వరకు పెనుకొండ టౌన్ లో సబ్-రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఆయన ఇంట్లో ప్రతి నిత్యం సాయి భజనలు, సాయి నామజపం నిర్వహించేవారు... 


    శ్రీ కేశవయ్య గారు ఇచ్చిన ఊదితో చాలామంది భక్తులకు రోగాలు నయమవడమే కాదు...భక్తుల కోరికలు నెరవేరేవి...


     ఈ మందిరాన్ని "దక్షిణ షిర్డీ" అని పిలుస్తారు. షిరిడీలో తప్ప ప్రపంచంలో మరేచోట సాయి విగ్రహాలు ప్రతిష్టించకూడదని శ్రీ కేశవయ్యగారి అభిప్రాయం... అందుకే వారు షిర్డీ నుండి తెచ్చిన పాలరాతి పాదుకలు... ద్వారకామాయి సాయిబాబా ఫోటోను ప్రతిష్టించి పూజ చేయడం ప్రారంభించారు...


      అందుకే ఈ ఆలయంలో సాయి భక్తులకు షిర్డీ సాయిబాబా విగ్రహం కనిపించదు.. ఇక్కడ సాయిభక్తులు బాబాను "పిలిస్తే వచ్చే దేవుడు" అని భావించి , ఆయనను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. 


      ఈ ఆలయంలో నిత్యం అఖండ ఆరాధన, పూజ, అభిషేకాలు...గురు, ఆదివారాల్లో ప్రత్యేక పూజలు.. అభిషేకాలు...భజనలు నిర్వహిస్తారు.


     1947 నుండి, శ్రీరామనవమి...గురుపూర్ణిమ, విజయదశమి...దత్త జయంతి...శ్రీ. కేశవయ్యగారి సమాధి చెందిన రోజు (ఆగస్టు 9) వంటి ప్రధాన పండుగలు ఘనంగా జరుపుకుంటారు.


    ఈ ఆలయానికి చెందిన భజన బృందం షిర్డీ..బెంగళూరు.. హైదరాబాద్ ..చెన్నై..కేరళ.. కోయంబత్తూర్..ఇతర ప్రాంతాలలో అనేక సందర్భాలలో 3 నుండి7 రోజుల పాటు అఖండ సాయి నామజపాన్ని నిర్వహించేవారు... 


    శ్రీ.డి శంకరయ్య...శ్రీ కుబేరప్ప...శ్రీ రామప్రసాద్ గురూజీ..శ్రీ కేశవయ్యగారి కుటుంబం వంటి అనేక మంది సాయిభక్తులు ఈ ఆలయానికి ధన సహాయాన్ని అందించారు..


     శ్రీ కేశవయ్య గారు "ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి" అనే నామంతో సాయిబాబాకు హారతి ఇచ్చేవారు.. ఆలయ కమిటీ వారు ఈనాటికీ అదే పాటిస్తున్నారు.


     ప్రతిరోజూ ఉదయం 7:30 గంటలకు రుద్రాభిషేకం..పంచామృత అభిషేకాలు నిర్వహిస్తారు...ప్రతిరోజూ సాయంత్రం గం.6-00 నుండి రాత్రి గం. 9-00 వరకు సాయి భజనలు జరుగుతాయి. గురు,ఆదివారాల్లో ప్రత్యేక సాయిపూజ, భజనలు జరుగుతాయి.


ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:

Post a Comment