Saturday, June 15, 2024

ఓం ఈశావాస్య మిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేనత్యక్తేన భుంజీథా: మాగృథ: కస్యస్విద్ధనమ్.*

*ఓం ఈశావాస్య మిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్  తేనత్యక్తేన భుంజీథా: మాగృథ: కస్యస్విద్ధనమ్.* 

*భావ ఔన్నత్యం:*


*ఈ జగత్తు అంతా (మార్పు చెందే వాటితో సహా ) భగవంతుడు నిండి ఉన్నాడు.* 
*ఈ భావన చేత త్యాగం అలవరచుకో .. ఈ భావం చేత కష్టార్జితాన్ని మాత్రమే అనుభవించాలి.*

*షిర్డీ లో ఒక సారి ఉభయ భాషా ( సంస్కృత మరాఠా భాష ) పండితుడు, దాసగణు, బాబాని సమీపించి ఈశవాస్య ఉపనిషత్ భాష్యం వ్రాయాలి కానీ హృదయం లో ఏదో వెలితిగా ఉండి భావం అక్షర రూపం దాల్చే అవకాశం లేదు సహాయం చెయ్యమంటారు.* 
*బాబా వారు ఈ ఉపనిషత్ సారాన్ని నీకు నీ ముంబై మిత్రుడు పని పిల్ల బోధపరుస్తుంది అని అంటారు.*
*బాబా వారు హాస్యం అడారు అని ఆ పండితుడు ఊరుకుంటాడు.*
*కొన్నాళ్ళకి దాసగణు ముంబై తన మిత్రుడి ఇంటికి వెళ్ళే సందర్భం వస్తుంది. అక్కడ బస చేసినప్పుడు అక్కడి పని చేసే చిన్న అమ్మాయి చూడ ముచ్చటగా ఉండి అన్ని పనులు ఎంతో చలాకిగా పూర్తి చేస్తూ కనిపిస్తుంది. ఆ పని పిల్ల పై జాలి కలిగి నూతన వస్త్రాలు ఆ అమ్మాయి కి ఇప్పిస్తాడు. నూతన వస్త్రాలు కట్టుకున్న ఆ అమ్మాయి "భగవంతుడు దయ అపారం " అనే అర్థం తో చక్కని గీతం పాడి ... తోటి పిల్లలతో సరదాగా గడిపి ఆ నూతన వస్త్రాలు తీసి మునుపు కట్టుకున్న చిరిగిన వస్త్రాలు తిరిగి ధరించి అదే ఆనందం తో పనులలో నిమగ్నమై పోయింది.* *చినిగిన బట్టలు ఆ అమ్మాయి భగవంతుని పై విశ్వాసం ..ఆనందాన్ని తగ్గించలేదు కొత్త వస్త్రాలు పెంచలేదు.* 
*ఈశ్వరుడు మార్పు చెందే వస్తువులను తాను మారకుండా ఆవరించి ఉన్నాడు అనే స్పృహ బ్రహ్మానందానికి కారణం అవుతుంది.*
*ఇదే పని పిల్ల తెలియచేసిన ఉపనిషత్ సారం.* 

*ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఈ విషయాన్ని ముందుగానే చెప్పిన సాయినాథుని త్రికాలజ్ఞానం.* 

*జై సాయినాథ.*

No comments:

Post a Comment