Thursday, May 30, 2024

మానవజన్మను ఎత్తిన తర్వాత పిచ్చి పిచ్చి కోరికలు పుట్టడం సహజం. కోట్లు సంపాదిద్దాం అని ఆలోచించే రోజులు ఇవి

*మానవజన్మను ఎత్తిన తర్వాత పిచ్చి పిచ్చి కోరికలు పుట్టడం సహజం. కోట్లు సంపాదిద్దాం అని ఆలోచించే రోజులు ఇవి.* 
*కానీ ఈ జన్మ ఒక మహానుబావుడి సేవకు అంకితం చేద్దాం అని ఆలోచిస్తే, ఇంక జీవితమే ధన్యం అయినట్లే.* 
*ఒక సద్గురువుకి చేసే సేవ ముందు మిగిలిన కోరికలు ఎందుకు పనికిరావు.* 

*అందుకే బాబా జీవిత చరిత్రను పరిశీలిస్తే, ఒక భక్తుడు బాబా దగ్గరికి కోరికలతో రాకండి అని చెప్పుతున్నపుడు అందుకు బాబా తిరిగి ఇలా అన్నారు* 
*అలా చెప్పవద్దు ముందు నా దగ్గరికి అందరు కోరికలతోనే వస్తారు. ఒకసారి వారి కోరికలు తీరాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అని సమాధానం చెప్పారు.* 

*ఇంకొకసారి ధనికులు ద్వారకామాయిలోకి వచ్చి బాబాతో మాకు డబ్బుకావాలి అని విసిగిస్తున్నారు. బాబా మౌనంగా కూర్చున్నారు.* 
*ఇంక బాబా ఇవ్వరు అని వాళ్ళు షిర్డీ నుండి వెళ్ళిపోయాక మిగిలిన భక్తులతో బాబా నా దగ్గర భగవంతుడి గురించి విషయాలు చాలా వున్నాయి. నన్ను అడగనక్కరలేదు తీసుకొని పొవ్వచు. పొంగి పోరలుతున్నది. కాని అది ఎవరు అడగరు. ఎవరు వచ్చినా కోరికలు, డబ్బు కావాలి అని వస్తున్నారు. ఎంత డబ్బు ఇస్తే మీ దేహాలు తృప్తి పొందుతాయి. డబ్బు అవసరమే ఎంతవరకు ? ఉండడానికి, తినడానికి, కట్టుకోవడానికి మాత్రమె. మనిషి కోరికలకు అంతు ఎక్కడుంది*. అని అడిగారు.

*భగవంతుడు కంటి ముందు ఇన్ని లీలలు చూపిస్తున్న ఒక్కసారి కూడా మనం మనకు జరిగిన మంచి పని వెనక ఎవరు ఉండి నడిపిస్తున్నారు అని కూడా ఆలోచించలేని పరిస్థితి ఈ కలియుగం.* 

*మనకు జరిగిన మంచి పనికి భగవంతుడు వచ్చి నేనే నీకు మంచి చేసింది అని చెప్పారు. మనం గుర్తించ గలిగితే ఆయన పాదాల మీద పడిపోతాం.*

 *షిర్డీ అంతటి పవిత్రమైన స్థలానికి వెళ్లి జీవితాలను మార్చుకున్న భక్తులు కొన్ని కొట్లలో వున్నారు.*

*అందుకే బాబా ఒక మాట అన్నారు.* 

*ఎవరైతే షిర్డీలో అడుగుపెడుతారో వాళ్ళ కష్టాలను తొలగిస్తాను అది సత్యం అని  బాబా నిరూపించారు.*

 *పిలిచిన వెంటనే పలికే దైవం శ్రీ షిర్డీ సాయిబాబా.* 

*మనం సాయి భక్తులం అవడం ఎంతటి పుణ్యమో మాటల్లో చెప్పలేనిది.*

 *బాబాకు భక్తుడై కూడా ఆయన సేవను చేయకపోవడం చాల పొరపాటు.*

 *మళ్ళీ ఇలాంటి మహానుభావుడు మనకు దొరకడు.* 

*" సాయిని సేవించి నీ జీవితం ధన్యం చేసుకో "*

      *ఓం శ్రీ సాయిరాం*

Wednesday, May 29, 2024

ఈ శరీరం చాలించిన తరువాత నేను షిరిడీలో సాయిబాబా రూపంలో ఉంటాను " అని అన్నారు అక్కల్కోట మహారాజుగా పేరుపొందిన శ్రీ స్వామీ సమర్థ

*"ఈ శరీరం చాలించిన తరువాత నేను షిరిడీలో సాయిబాబా రూపంలో ఉంటాను " అని అన్నారు అక్కల్కోట మహారాజుగా పేరుపొందిన శ్రీ స్వామీ సమర్థ.*
*తన దేహము చాలించిన తరువాత తన భక్తులు, ఆశ్రీతులు అయిన కొందరిని షిర్డీ సాయిబాబా వద్దకు వెళ్లమని సలహ యిచ్చారు.*

*షెగాం మహారాజుగా ప్రసిద్దులైన గజానన మహరాజ్, గణేశ శ్రీకృష్ణ ఖాపర్డే కుటుంబాన్ని, సాయిబాబాను ఆశ్రయించమని అదేశించారు.*

*అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాధిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, సమర్థ సచ్చిదానంద సద్గురువుగా, సాయిబాబాను కీర్తించటం మామూలు అయినది భక్తులకు.*

*అందరికీ సాయినాధునిలో సుగుణాలు ఆకట్టుకొన్నాయి. అలా ఆకట్టుకోవడం ఎప్పటినుండో జరిగేదీ.*

*ఒకసారి సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాన్ సంభవించింది. గాలి ఎక్కువ అవుతున్నది. నేల అంతా నీటిమయమవుతుంది.*
*షిర్డి గ్రామ వాసులు అందరూ ద్వారకామాయికి వచ్చారు. వారు విపత్తును తొలగించమని బాబాను ప్రార్ధించారు.*

*బాబా గొప్ప ధ్వనితో మశీదు అంచున నిలబడి " ఆగు ! ఆగు ! నీ కోపమును తగ్గించుము. నెమ్మదించుము !" అని తుఫాన్ ని గద్దించారు.*

*కొన్ని నిముషాలలో తుఫాను ఉధృతి తగ్గింది. చంద్రుడు కనిపించాడు. ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు.*

*అలాంటి దైవిక శక్తులతో ప్రజలను కాపాడతారు మహనీయులు.*

Tuesday, May 28, 2024

రాజమ్మ సాయినాథుని అనేక లీలలు కనులారా గాంచినదని తెలియవస్తుంది.

*దక్షిణ భారతదేశం  నుండి సాయిబాబా మహాసమాధికి పూర్వము బాబాను దర్శించిన వారే తక్కువ. అందులో మహిళలు మరీ తక్కువ.* 

*1889 సం. మే నెల 29 వ తారీకున తమిళనాడు రాష్ట్రంలో కొయంబత్తూర్ సమీపాన వెల్లకినారు అనే గ్రామములో రాజమ్మ జన్మించింది.*

*ఈమె పెదనాన్న శ్రీ తంగవేలు గౌండర్ సన్యాసం స్వీకరించి, షిర్డిలోని సాయిబాబాను దర్శించారు.*
*సాయిబాబాను తన గ్రామానికి తీసుకొచ్చారని, రాజమ్మను శ్రీ సాయి దీవించారని చెబుతారు.*

*రాజమ్మకు వివాహమైనది. ఒక కుమారుడు కూడా జన్మించాడు. రాజమ్మకు షిరిడీలోని సాయిబాబాను దర్శించాలని కోరిక కలిగింది. దానికి ఆమె భర్త అసమ్మతి తెలియచేసాడు. కానీ ఒక షరతు పెట్టాడు.*

*ఇటువంటి షరతులు పెట్టిన మరొక భక్తుడు లక్ష్మణ్ కృష్ణాజీ నూల్కరు,  ఒకటి బ్రాహ్మణ వంటమనిషి దొరకవలెనని, చక్కని నాగపూరు కమలాఫలముల లభించాలని.*

*బాబా సంకల్పించుకొనినచో కొదవేమున్నది.* 
*ఆ రెండు షరతులు వెంటనే నెరవేరినవి. నూల్కరు సాయిబాబాను దర్శించాడు.*
*రాజమ్మ భర్త సుబ్రమణ్య గౌండరు "మన ఇంటిలోని ఆవు ఏడు దినములలో అమ్ముడుపోయినచో తప్పక షిరిడీకి వెళదాం " అని అన్నాడు.*

*సాయి కృపవలన ఆ ఆవు నాలుగు రోజులలోనే అమ్ముడుపోయింది. ధర కూడా 55 -00 రూపాయలు పలికింది.*

*ఈ సాయిలీలా అనుభూతి ఫలితంగా 1908 సం. లో 17 సం. వయస్సుగల రాజమ్మ, భర్త సుబ్రమణ్య గౌండరు, పసిబిడ్డతో షిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించారు.*

*"అల్లా అచ్చా కరేగా అని రాజమ్మను దీవించి, సాయి రాజమ్మను "నల్లా ఇరు "( చల్లగా ఉండు ) అని దీవించారు.*
*సాయిబాబా వీరితో తమిళంలోనే సంభాషించేవారు.*

*రాజమ్మ సాయినాథుని అనేక లీలలు కనులారా గాంచినదని తెలియవస్తుంది.*

*సాయిబాబా ఆరడుగుల ఎత్తు, పొడవైన చేతులు (మోకాళ్ళ దాటి ఉండేవి ).*
*కొనదేలిన ముక్కు, కంటిపాపలు నీలముగా మిలమిల మెఱయుచు, తీక్షణమైన చూపుతో సాయి ఉండేవారని ఈమె వర్ణించింది.*

*బాబా తన కృపాధారలు కురిపించి ఈమె నామమును (రాజమ్మ ) శివమ్మ తాయిగా మార్చినారు.*
*ఈమె తదనంతరం పెక్కుమార్లు సాయి దర్శనం చేసి, దక్షిణాదిన అనేక సాయి మందిరములను ప్రతిష్ట చేసినది.*
*అంతేగాక బెంగళూరు నగరంలో స్వయముగా సాయిమందిరం నిర్మించుకున్న ధన్య జీవి.*

*కర్ణాటక, తమిళ రాష్ట్రాలలో ఎందరికో సాయిబాబా గూర్చి తెలిపిన భక్తురాలు* 

     *సాయి దర్బార్ వారి గ్రంథ నుండి సేకరణ*1 za

ఛోఖా మేళా

🌹 *పరమ భక్తుడు* 🌹

*ఒకనాడు ఛోఖా మేళా మరికొందరితో కలసి ఒక గోడ కడుతుండగా, అనుకోకుండా అది కూలిపోయి చోఖా మేళా మరికొందరు ఆ గోడ శిథిలాల్లో పడిమరణించారు.*

*మరణించిన వారి మృతదేహాలను తీయడానికి చాలా సమయం పట్టింది.*
*అందరూ నిర్ణయించి ఆ మృతదేహాలకు సాముహిక దహనం చేశారు.*

*అప్పుడు మరొక పాండురంగ భక్తుడైన నామదేవ్ తో పాండురంగడు " ఛోఖా మేళా నా భక్తుడు. అతని సమాధి నా మందిరమునకు ఎదురుగా ఉండాలనే ఒకే ఒక్క కోరికతో జీవించాడు.*
 *అతని కోరిక తీర్చుట నా లక్ష్యము " అని పలికారు.*
*అది విని నామదేవ్ పాండురంగనితో " స్వామీ !మరణించిన వారి ఎముకలలో, చోఖా మేళా ఎముకలను గుర్తించడం సాధ్యం కాదుకదా ! " అని జవాబిచ్చాడు* 

*అందుకు పాండురంగడు నామదేవ్ తో " ఛోఖా మేళా ఎముకలు సహితం నా నామాన్ని ఉచ్ఛరిస్తాయి.* *జాగ్రత్తగా విను అని స్వామి పలికారు.*
*అదే విధంగా నామదేవుడు చోఖా మేళా తో పాటు మరణించినవారి ఎముకల గుట్ట దగ్గరకు వెళ్ళి ఒకొక్క ఎముకను చెవి దగ్గర పెట్టుకుని, ఏవి అయితే పాండురంగని నామస్మరణ చేసినవో, వాటిని ఏరి తీసుకొచ్చి, పండరీ పురంలో, పాండురంగని ఆలయం ఎదురుగా చోఖా మేళా సమాధిని నామదేవుఁడు నిర్మించాడు.*
*ఎప్పటికీ ఛోఖామెలా ఎముకలు పాండురంగ నామాన్నే ఉచ్చరిస్తాయి.*
*చోఖా మేళా వైశాఖ బహుళ పంచమి నాడు దేహాన్ని త్యజించాడు.*
*పండరీపురంలో చోఖా మేళా సమాధి నిర్మించారు.*
 
*నేడు వైశాఖ బహుళ పంచమి.* 
          *28 -5 -2024*

Sunday, May 26, 2024

సాయిబాబా శ్రద్ద - సబూరీలకు పెద్దపీట వేశారు.

*షిర్డీ సాయిబాబా శ్రద్ద - సబూరీలకు పెద్దపీట వేశారు.*

*షిరిడీలో 1909 సం.లో ప్రారంభమైన గురుపూర్ణిమ ఉత్సవాలు యధావిధిగా ప్రతీ ఆషాఢపూర్ణిమకు గురుపూర్ణిమ ఉత్సవాలు నేటికినీ కొనసాగుతునే వున్నాయి.*

*అలా 1914 సం. లో షిరిడీలో  గురుపూర్ణిమ సందర్భంగా విశేషముగా ప్రసాదాలు  తయారుచేస్తున్నారు.*

*ఆ సందర్భంగా సాయిభక్తురాలైన రాధాకృష్ణమాయి, మసాల దినుసులు పొడిచేసేందుకు ఒక పెద్ద రోలును తరలించవలసి వచ్చింది.*
*ఆ సమయములో ఆమెకు సహాయము చేసేందుకు ఎం .బి .రేగే  అను భక్తుడు అక్కడకు వచ్చాడు.*

*అదే సమయములో పురందరే అనే మరొక బాబా భక్తుడు ఆ పెద్ద రోలును కదలించడానికి వారితో కలిశాడు.*
*అలా ఆ రోలును కదిలించడంలో రేగే చెయ్యి ఆ రోలుక్రిందపడి నుజ్జయిపోయేది.*

*కానీ అది గమనించిన రాధాకృష్ణమాయి చాకచాక్యంగా ఆ రోలును తనవైపు తిప్పుకొని రేగెను కాపాడింది, అలా చేయడంలో ఆమె చూపుడువేలు రోలుక్రింద నలిగి రక్తం కారసాగింది.*

*వెంటనే ఆమె ఒక గుడ్డను నూనెలో తడిపి తన వేలుకు చుట్టుకొంది.*
*అలా ఆ తరువాత మిగిలిన కార్యక్రమము పూర్తిచేసి వంటల పని ముగించింది.*

*ఆ పని అంతా పూర్తిఅయ్యేక రేగెను వెంటబెట్టుకుని ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి తన బాధ తీరేదాకా షుమారు అరగంట సేపు విలపించింది.*

*తన వేలు చిట్లినప్పుడు, బాధతో విలపిస్తే మిగతా పనులు దెబ్బతింటాయని ఓర్పుతో భరించింది.*

*అపూర్వ కార్యదక్షతతో బాబాను సేవించిన ఆ భక్తురాలు చిరస్మరణీయురాలు.*

*శిర్డీసాయి బాబాను మనసావాచాకర్మణా అంకితమైన సుందరీబాయి క్షీరసాగర్ అనే రాధాకృష్ణమాయి ధన్యురాలు.*